E-Paper
Advertisement

Adilabad News: ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఆదిలాబాద్ జిల్లాలో అర్థరాత్రి ప్రమాదం

Adilabad News: ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఆదిలాబాద్ జిల్లాలో అర్థరాత్రి ప్రమాదం
Advertisement

Adilabad News: రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్త అని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్టుగా ఆదిలాబాద్ జిల్లాలోని కుప్టి సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెట్ బస్సు-లారీ ఢీ కొట్టాయి. ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. అసలేం జరిగింది?

శనివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో కుప్టి సమీపంలో ప్రమాదం జరిగింది. గోరఖ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రైవేటు బస్సు-లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందు బాగం భారీగా డ్యామేజ్ అయ్యింది. బస్సు అద్దాలు పగిలిపోయాయి. లారీ ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనతో బస్సులో ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

Advertisement

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు-లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఘటనలో సమయంలో ట్రాపిక్ జామ్ అయ్యింది.

ఘటన గురించి సమాచారం అందుకున్నపోలీసులు, వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించారు.  ట్రాఫిక్ క్లియర్  చేశారు. బస్సులోని ప్రయాణికు మరో వాహనంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి వుంది.

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×