BigTV English
Advertisement

Adilabad News: ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఆదిలాబాద్ జిల్లాలో అర్థరాత్రి ప్రమాదం

Adilabad News: ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఆదిలాబాద్ జిల్లాలో అర్థరాత్రి ప్రమాదం

Adilabad News: రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్త అని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్టుగా ఆదిలాబాద్ జిల్లాలోని కుప్టి సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెట్ బస్సు-లారీ ఢీ కొట్టాయి. ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. అసలేం జరిగింది?


శనివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో కుప్టి సమీపంలో ప్రమాదం జరిగింది. గోరఖ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రైవేటు బస్సు-లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందు బాగం భారీగా డ్యామేజ్ అయ్యింది. బస్సు అద్దాలు పగిలిపోయాయి. లారీ ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనతో బస్సులో ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు-లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఘటనలో సమయంలో ట్రాపిక్ జామ్ అయ్యింది.


ఘటన గురించి సమాచారం అందుకున్నపోలీసులు, వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించారు.  ట్రాఫిక్ క్లియర్  చేశారు. బస్సులోని ప్రయాణికు మరో వాహనంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి వుంది.

Related News

Konda Surekha: నర్సాపూర్‌లో ఎకో పార్క్‌‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు..

Private collages Strike: విద్యార్థులకు బిగ్ అలర్ట్..! తెలంగాణలో కాలేజీలు బంద్..

Warangal Gang War: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సురేందర్ అరెస్ట్..

Congress vs BRS: ఫర్నిచర్‌ను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు.. మణుగూరు BRS ఆఫీస్ వద్ద హై టెన్షన్..

Rain Alert: మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న ముప్పు..

Kavitha: ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు

Big Stories

×