E-Paper
Advertisement

Railway Station: రైల్వే స్టేషన్ లో యువకుడి పైత్యం, అందరూ చూస్తుండగా మూత్ర విసర్జన, వీడియో వైరల్!

Railway Station: రైల్వే స్టేషన్ లో యువకుడి పైత్యం, అందరూ చూస్తుండగా మూత్ర విసర్జన,  వీడియో వైరల్!

Urinating In Railway Station:  

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు అగౌరవంగా ప్రవర్తించడం కూడా నేరంగా పరిగణిస్తారు. తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌ లో ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. స్టేషన్ బోర్డు పోల్ మీద బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. సదరు యువకుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌లో బహిరంగ మూత్ర విసర్జన

దక్షిణ మధ్య రైల్వే ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడి పేరు మీద ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌గా పేరు మార్చినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టేషన్ లో కొత్తగా పెయింట్ చేసిన బోర్డు దగ్గర ఓ యువకుడు మూత్ర విసర్జన చేస్తుండగా, మరో ఇద్దరు వ్యక్తులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపిస్తుంది. మూత్రం పోసిన తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పందించిన రైల్వేసేవా

ఈ ఘటనపై రైల్వేసేవా స్పందించింది. “మీ ఫిర్యాదుపై తక్షణ చర్య తీసుకోవడానికి దయచేసి మీ మొబైల్ నంబర్‌ ను మాతో పంచుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము” అని వెల్లడించింది. అటు “RPF, పోలీసులు అతడిని పట్టుకుంటారు.  కోర్టు జరిమానా విధిస్తుంది. బ్రిటిష్ పాలన నుంచి ఇది కామన్ అయ్యింది. ఈ ఘటనను సింపుల్ గా తీసుకోకూడదు.  మున్సిపల్ చట్టాలు బహిరంగ మూత్ర విసర్జనను నిషేధిస్తాయి. కేవలం జరిమానా విధించి వదిలేస్తాయి. కానీ, ఈ ఘటనను మరింత సీరియస్ గా తీసుకోవాలి” అని నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ వ్యక్తిని తప్పకుండా అరెస్ట్ చేయాలి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇలాంటి వాడిని లాకప్ లో వేసి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. లేదంటే ఇలాంటి వారు మరింత మంది తయారవుతారు” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!

కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు

అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నాందేడ్ రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) క్రైమ్ నంబర్ 1487/2025, U/S 145(b) ఆఫ్ రైల్వేస్ చట్టం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతుందన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×