E-Paper
Advertisement

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు
Advertisement

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలపై రాజకీయాలు ఒకొక్కటిగా రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ కూడా నోరు విప్పింది. తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు బీజేపీ చీఫ్ రామచందర్‌రావు.

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ

Advertisement

గురువారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఆయన మీటింగ్ పెడితే కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రియాక్ట్ అవుతున్నారని అన్నారు.

తెలంగాణ మీ అయ్యా జాగీరా అని పవన్ అంటే కచ్చితంగా స్పందిస్తామన్నారు. తనకు తెలిసినదేంటంటే.. కాంగ్రెస్ మంత్రి తెలంగాణ తన జాగీరు అన్నట్టుగా మాట్లాడారని వివరించారు. దానికి మద్దతుగా బీఆర్ఎస్ నేత తెలంగాణ ఎవరి సొత్తు కాదని, నాలుగు కోట్ల ప్రజల జాగీరు అని అన్నారని తెలిపారు.

Advertisement

రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

నాలుగు కోట్ల జనాభా జాగీరని ఇప్పుడు అంటున్నారని, గతంలో మా కుటుంబం జాగీరని పాలన చేశారన్నారు. వాళ్లు మాటలు తాను వినలేదని తెలంగాణను ఎవరు అవమాన పరిచినా, ప్రజల మనోభావాలను దెబ్బ తీసినా దాన్ని కచ్చితంగా బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ హీరోనా విలనా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించార ఆ పార్టీ స్టేట్ చీఫ్. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సూపర్ హీరో అని మనసులోని మాట బయపెట్టారు. తాము ప్రజలతో పని చేస్తున్నామని, ప్రజల కోసం, ప్రజల్లోనే చేస్తామన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్‌తో పని చేయాల్సిన అవసరం లేదన్నారు.

ALSO READ:  గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగాలేదు

బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ఆ రెండు పార్టీలు కలిసి వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అందులో మహిళా రిజర్వేషన్లు- నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అని చెప్పారు. చెన్నైలో స్టాలిన్ సమావేశం పెడితే సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ కలిసి వెళ్లారని గుర్తు చేశారు.

వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయన్నారు. సర్ విషయంలోనూ రెండు పార్టీలు వ్యతిరేకించాయన్నారు. అన్ని అంశాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు వున్నాయని, పని చేస్తున్నాయని చెప్పారు. తమను భూతంగా చూపిస్తున్నారని, అసలు భూతాలు ఈ రెండు పార్టీలని తేల్చేశారు.

 

 

 

Related News

హైదరాబాద్‌కు సీఎం రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×