E-Paper
Advertisement

Fee Reimbursement: మూసీ సుందరీకరణకు వేల కోట్లు.. పేద విద్యార్థులకు నిధులు లేవా?: ఆర్.కృష్ణయ్య ఫైర్

Fee Reimbursement: మూసీ సుందరీకరణకు వేల కోట్లు.. పేద విద్యార్థులకు నిధులు లేవా?: ఆర్.కృష్ణయ్య ఫైర్
Advertisement

Fee Reimbursement: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కొత్తపేట చౌరస్తా నుండి ఎల్బీనగర్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.కృష్ణయ్య ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లు పేరుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వం ఈ బకాయిలను మొత్తం చెల్లించకుండా, మొన్నటి బడ్జెట్ విడుదలలో కేవలం రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీసీ విద్యార్థులను ఘోరంగా అవమానించడమేనని, వారికి ప్రభుత్వం చేస్తున్న తీరని అన్యాయమని మండిపడ్డారు.

Advertisement

ఖజానాలో డబ్బులు లేవని సాకులు చెబుతున్న ప్రభుత్వం.. మూసీ నది సుందరీకరణకు, ఫోర్త్ సిటీ నిర్మాణానికి, స్పోర్ట్స్ కోసం వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తోందని ఆర్.కృష్ణయ్య సూటిగా ప్రశ్నించారు. “మూసీలో పోయడానికి మీ దగ్గర వేల కోట్లు ఉంటాయి.. కానీ పేద విద్యార్థుల చదువులకు, వారి భవిష్యత్తుకు మాత్రం చిల్లిగవ్వ ఉండదా?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు తాను చేసిన పోరాట ఫలితంగానే, పేద విద్యార్థుల కష్టాలను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రకటించి న్యాయం చేశారని కృష్ణయ్య గుర్తుచేశారు. కానీ నేడు ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపుతున్నారని, దీనివల్ల ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో విద్యార్థులంతా ఏకమై ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బకాయిలు మొత్తం విడుదల చేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Read Also: Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఎట్టకేలకు మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×