BigTV English
Advertisement

Rahul Gandhi: రేవంత్ సర్కార్ ఈ సమ్మిట్ నిర్వహించినందుకు సంతోషంగా ఉంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi: రేవంత్ సర్కార్ ఈ సమ్మిట్ నిర్వహించినందుకు సంతోషంగా ఉంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ నివాళి అర్పించారు.


‘నిన్న కశ్మీర్ కు వెళ్లడంతో సమ్మిట్ కు రాలేకపోయా. ఈ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. పదేళ్ల క్రితం ఉన్న రాజకీయాలకు ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. పాత తరం రాజకీయం అంతరించిపోయింది. ఇప్పుడంతా కొత్తతరం రాజకీయం నడుస్తోంది. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదు. భారత్ జోడో యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ప్రజల సమస్యలు వినడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రేమతో ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నాను. విపక్ష పార్టీలు ప్రపంచవ్యాప్తంగా అణిచివేతను ఎదుర్కొంటున్నాయి. విపక్షాల వాన వినిపించేందుకు.. కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

‘దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గం చూపిస్తున్నారు. నాయకులు కూడా ప్రజలు చూపించిన మార్గంలోనే వెళ్లాలి. భారత్ జోడో యాత్రలో దేశ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపించారు. సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో పాలకులు, రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాలను, సమస్యలను సంపూర్ణంగా తెలుసుకోలేక పోతున్నారు. దేశంలో నూతన రాజకీయాలకు, నూతన ఆలోచనలకు ఈ సమ్మిట్ వేదిక అయినందుకు సంతోషంగా ఉంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ALSO READ: CM Chandrababu Naidu: ఏపీలో మరో కొత్త పథకం అమలు.. వారి అకౌంట్లలో రూ.20,000

ALSO READ: NMDC Recruitment: డిగ్రీ అర్హతతో 934 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,70,000 జీతం

Related News

Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..

Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి

Telangana Politics: కేసీఆర్‌పై సీబీఐ కేసు.. సీఎం రేవంత్ డిమాండ్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

Collages Bandh: రూ. 5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీలు బంద్..!

CP Sajjanar: డ్యూటీలో తప్పులు చేస్తే చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్-బీజేపీలకు నవంబర్ సెంటిమెంట్ మాటేంటి?

High Court: మాయం అవుతున్న చెరువులు.. రెవెన్యూ శాఖ అధికారుల పై హైకోర్టు సీరియస్

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Big Stories

×