E-Paper
Advertisement

Rail: రైలే కదాని రాయి విసిరితే.. ఐదేళ్లు జైలు.. వందేభారత్ ఎఫెక్ట్..

Rail: రైలే కదాని రాయి విసిరితే.. ఐదేళ్లు జైలు.. వందేభారత్ ఎఫెక్ట్..
Advertisement

Rail: వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రైళ్లు. హైస్పీడ్ ట్రైన్‌తో వేగంగా ప్రయాణించే అవకాశం. లోపల సదుపాయాలు లగ్జరీగా ఉంటాయి. అందుకే, వందేభారత్ రైల్ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటోంది కేంద్రం. అయితే, బీజేపీ-మోదీపై కోపం ఉన్నవారంతా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. కళ్లమంటో ఏంటో తెలీదు కాని.. ఇటీవల వందేభారత్ రైల్‌పై రాళ్ల దాడులు బాగా పెరుగుతున్నాయి.

ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు స్టేట్స్‌లోనూ రాళ్ల దాడి ఘటనలు జరుగుతున్నాయి. అందుకే, ఇది ఇలానే వదిలేస్తే మరింత ఓవర్ చేస్తారని భావించిన రైల్వే శాఖ.. కఠిన శిక్షలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. బూజు పట్టిన నిబంధనలను బయటకు తీసి సాన బెట్టింది. రైళ్లపై రాళ్లు విసరడం వంటివి చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే వార్నింగ్ ఇచ్చింది. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు దిగకూడదని తేల్చి చెప్పింది.

Advertisement

కొందరు పోకిరీలు ఉంటారు. రైల్వే ట్రాకులపై మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ, కబుర్లు చెప్పుకుంటూ టైమ్‌పాస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లే ఆకతాయితనంతో రైళ్లపై రాళ్లు విసురుతుంటారు. అదో టైప్ శాడిజం వారిది. అలా రాళ్లు విసిరితే.. పలువురు ప్రయాణికులకు అవి తగిలి గాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు.. ఏపీ, తెలంగాణలో 9 రాళ్లు విసిరిన కేసులు నమోదయ్యాయి. భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ దాడుల్లో అయిదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసుల్లో 39 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు రైల్వే అధికారులు.

అందుకే మరి, రైలే కదాని రాయి విసిరితే.. ఐదేళ్లు జైల్లో వేస్తారు జాగ్రత్త.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×