E-Paper
Advertisement

Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్‌ ‌యువ వికాసం స్కీమ్.. మొదటి లిస్టు రెడీ

Rajiv Yuva Vikasam Scheme:  రాజీవ్‌ ‌యువ వికాసం స్కీమ్.. మొదటి లిస్టు రెడీ
Advertisement

Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన స్కీమ్ రాజీవ్ యువ వికాసం. సోమవారం అంటే జూన్ 2న ఎంపికైన లబ్దిదారులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మొదటి లిస్టు దాదాపుగా ఫైనల్ అయ్యింది.

ఈ పథకం కింద ఇప్పటివరకు 16 లక్షల పైచిలుకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం నాలుగు కేటగిరీల్లో ఆయా దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. తొలి విడతగా లక్ష మందికి 50 వేల నుంచి లక్ష రూపాయల విలువ గల యూనిట్లకు సంబంధించి ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాలు రెడీ అయ్యాయి.

Advertisement

తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జూన్ రెండు(సోమవారం) ఆయా పత్రాలను లబ్దిదారులకు ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 2 నుంచి 9 వరకు వాటికి సంబంధించి ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలన్నది అధికారుల మాట. జూన్ 10 నుంచి 15 వరకు ఎంపికైన లబ్దిదారులకు ట్రైనింగ్ ఉండనుంది.

జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ స్కీమ్ కోసం హైదరాబాద్ నుంచి లక్షా 28 వేల 763 దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. వెరిఫికేషన్ బాధ్యతను బ్యాంకర్లకు అందజేయడం, వారు పూర్తి చేయడం దాదాపుగా జరిగిపోయింది.అలానే 2 లక్షల లోపు వారికి జులైలో లోన్లు అందజేయనుంది.

Advertisement

ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక అప్ డేట్స్.. 5న సిట్ ముందుకు ప్రభాకర్‌రావు

రూ.2 నుంచి 4 లక్షల వరకు ఉన్నవారికి ఆగస్టు, సెప్టెంబర్ లబ్దిదారులకు లోన్లు అందజేయనున్నట్టు చెప్పుకొచ్చారు. తొలి విడతా జాబితాలో హైదరాబాద్ నుంచి 9 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 3 వేల 721మంది 50 వేల రుణాలు మంజూరు చేయనున్నారు. మిగతా 5 వేల పైచిలుకు లబ్దిదారులకు లక్ష లోన్లు అందజేస్తారు.

వీరందరికీ జూన్ 2న డబ్బులు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం మాట.మిగతా దరఖాస్తులు లక్ష విలువకు మించినవి కావడంతో విడతల వారీగా శాంక్షన్‌ చేయనున్నాయి బ్యాంకర్లు. లక్ష స్కీమ్​‌కు 10 వేలు మాత్రమే బ్యాంక్​‌లోన్‌ ‌ఇవ్వనుంది. మిగతా 90 వేలు ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది. నిజామాబాద్ జిల్లాలో రాజీవ్‌ ‌యువ వికాసం కింద 22,120 యూనిట్లకు 59,027 మందికి అప్లై చేసుకున్నారు.

వారిలో 7,539 అప్లికేషన్​‌లు ఈనెలలో (జూన్‌) పరిష్కారం కానున్నాయి. మిగతా లక్షకు మించినవారి స్కీమ్‌‌ కు సంబంధించి 51,488 అప్లికేషన్​లను విడతల మంజూరు చేయనున్నారు. ఆయా స్కీమ్‌కు శాంక్షన్‌ ‌ఇచ్చిన తర్వాత ప్రొగ్రామ్‌ ‌ఫిక్స్‌‌చేశారు. నిరుద్యోగుల బ్యాంక్‌ ‌సిబిల్‌ ‌స్కోర్‌ ‌ఆధారంగా చేసుకొని వాటిని మంజూరు చేశారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×