BigTV English

Train Derails: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కుప్పకూలిన వంతెన, రష్యా రైలు పట్టాలు తప్పి స్పాట్ లోనే..

Train Derails: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కుప్పకూలిన వంతెన, రష్యా రైలు పట్టాలు తప్పి స్పాట్ లోనే..

Russia Train Accident: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న రష్యాలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. రైల్వే వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో లోకో పైలెట్ సహా పలువురు దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో ఘటన

రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి వంతెన కూలిపోయింది.  వంతెన దాటుతున్న సమయంలో కూలిపోవడంతో రైలు పట్టాలు తప్పి అమాంతం కింద పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోయినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. వారిలో లోకో పైలెట్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. మరో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ రైలు వైగోనిచ్స్ క్ జిల్లాలో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. మాస్కో నుంచి క్లిమోవ్‌ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.


ఇంతకీ వంతెన ఎలా కూలింది?  

ఉక్రెయిన్, రష్యా మధ్యలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు సమీపంలో ఉన్న రైల్వే వంతెన కూలడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వంతెనను ఉద్దేశపూర్వకంగా పేల్చివేసి ఉండవచ్చని రష్యా అధికారులు భావిస్తున్నారు. అయితే, అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సంఘటనకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు షేర్ చేసిన ఫోటోలు కూలిపోయిన వంతెన మీది నుంచి రైలు పడిపోయి కాంట్రీట్ ముక్కల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలను వంతెన దాటడానికి కొన్ని క్షణాల ముందు ఈ ఘటన జరిగినట్లు అర్థం అవుతోంది.  మూడు సంవత్సరాల క్రితం రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నది. బ్రయాన్స్క్‌తో సహా దాని సరిహద్దు ప్రాంతాలు పదేపదే డ్రోన్ దాడులు, మిసైల్ దాడుల కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వంతెన బలహీనమై కూలిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను అధికారులు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Read Also: దేశాలు, ఖండాలను కలిపే వంతెనలు.. ఈ సరిహద్దులు భలే ఉంటాయ్ బాసు!

వచ్చేవారం ఇరు దేశాల మధ్య రెండో దఫా చర్చలు

మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు శాంతి చర్చలకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయి. ఇస్తాంబుల్‌ లో ఉక్రేనియన్ అధికారులతో రెండవ దశ చర్చలు జరిపేందుకు రష్యా అధికారులు సిద్ధం అవుతున్నారు. ఘర్షణను వదిలి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కో, కైవ్‌ అధినేతలకు సూచించారు. ఉక్రేనియన్ అధికారులు ఇప్పటి వరకు రెండో దశ చర్చల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: తిరుగుతూ డబ్బులు సంపాదించే ఉపాయం.. ట్రావెలింగ్‌తో లక్షల్లో ఆదాయం!

Related News

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Big Stories

×