E-Paper
Advertisement

Rangam : లష్కర్ బోనాలు.. స్వర్ణలత భవిష్యవాణి.. ఏం చెప్పారంటే..?

Rangam : లష్కర్ బోనాలు.. స్వర్ణలత భవిష్యవాణి.. ఏం చెప్పారంటే..?

Rangam: సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన రంగం కార్యక్రమంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తుల నుంచి పూజలు సంతోషంగా అందుకున్నానని తెలిపారు. గతేడాది ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారని చెప్పారు. కావాల్సిన బలాన్నిచ్చానని స్పష్టం చేశారు. ప్రజల వెంటా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆలస్యమైనా వర్షాలు వస్తాయని చెప్పారు.

అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు భయపడవద్దు జోగిని స్వర్ణలత సూచించారు. ప్రజలను కాపాడే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. 5 వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలని కోరారు. రంగం కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. అలాగే భవిష్యవాణి వినేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. రంగం కార్యక్రమం జరుగుతున్న సమయంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు.

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్‌ దంపతులతోపాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు , బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన తర్వాత సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×