Rare Bird: స్వేచ్ఛ బ్యూరో: పట్టణ శివారులోని కేసీ క్యాంపు ప్రాంతంలో శుక్రవారం ఓ వింత పక్షి ప్రత్యక్షమై స్థానికులను విస్మయానికి గురిచేసింది. మనిషి ముఖ వర్చస్సును పోలి ఉన్న ఈ పక్షిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. కాకతీయ కాలువ వంతెన సమీపంలోని ఓ తోటలో ఈ పక్షి కనిపించింది. కోతులు దీనిని తరమడంతో ప్రాణభయంతో పారిపోతూ పొదల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడింది.
Also Read: Railway Dispute: పునర్వి విభజన చట్టానికి తూట్లు.. ఓరుగల్లులో రైల్వే ఖజానాకు భారీగా గండి..!
స్థానికుడు భాస్కర్ సమాచారంతో సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన పక్షిని సురక్షితంగా బయటకు తీసి, పశువైద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు పక్షిని స్వాధీనం చేసుకుని మెరుగైన సంరక్షణ కోసం కరీంనగర్లోని డీర్ పార్కుకు తరలించారు. ఆపదలో ఉన్న మూగజీవిని కాపాడిన వేణుగోపాల్ను స్థానికులు అభినందించారు.
Also Read: Tourism Scam: మంత్రి జూపల్లి కష్టమంతా వృదా అయినట్టేనా.. టూరిజంలో నయా దందా..!