E-Paper
Advertisement

Revanth Reddy : ఆ కంపెనీలపై ఐటీ దాడులు .. అందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్‌.. రేవంత్ హాట్ కామెంట్స్..

Revanth Reddy :  ఆ కంపెనీలపై ఐటీ దాడులు .. అందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్‌.. రేవంత్ హాట్ కామెంట్స్..
Advertisement

Revanth Reddy latest news(Telangana politics) : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల జరగడంతోనే కేటీఆర్ హస్తినకు వెళ్లారని ఆరోపించారు. ఐటీ సోదాల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయన్నారు. ఈ విషయాలు పత్రికల్లో, మీడియాలో రాకుండా మేనేజ్ చేశారని వివరించారు. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి నిధులు తెచ్చేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ రోడ్ల కోసం మాట్లాడేందుకు కేంద్రమంత్రులను కలవలేదని.. సొంత ఆస్తుల గుట్టు బయటకురాకుండా మేనేజ్ చేసేందుకు వారిని కలిశారని ఆరోపించారు. రహస్య ఆస్తుల వివరాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

కేసీఆర్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దలతో ఏమీ కాదని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. తమతో కలిసి గల్లీలో పోరాడాలని పిలుపునిచ్చారు.

కేటీఆర్ సడెన్ గా ఢిల్లీ వెళ్లడంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎప్పుడూ కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్లని మంత్రి ఉన్నట్టుండి హస్తిన బాట పట్టడంపై సందేహాలు వచ్చాయి. ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై , కేసీఆర్ కుటుంబంపైనా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×