E-Paper
Advertisement

ఫ్యూచర్ సిటీ ప్లాన్ అదిరింది.. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు!

ఫ్యూచర్ సిటీ ప్లాన్ అదిరింది.. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు!
Advertisement

Future City: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో పరిశ్రమల శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) అధికారులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను పారిశ్రామికంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ పూర్తిగా నెట్ జీరో సిటీ (కాలుష్య రహిత నగరం) తరహాలోనే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి నగరాలను అధ్యయనం చేసి, ఇక్కడి మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాతే సంస్థలకు భూ కేటాయింపులు జరపాలని ఆదేశించారు. అలాగే, ఈ ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాలు కేటాయించనున్నారు.

హెల్త్ క్లస్టర్ & డేటా సిటీ

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ మన ఫ్యూచర్ సిటీకే వచ్చేలా గట్టి ప్రయత్నాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే దీని కోసం తానే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తానని భరోసా ఇచ్చారు. జూన్ కల్లా ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమల స్థాపనకు శంకుస్థాపనలు జరగాలని గడువు విధించారు. అంతేకాదు, డేటా సెంటర్ల హబ్‌గా మార్చేందుకు 1500 ఎకరాల్లో ‘డేటా సిటీ’ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్టీపీ (STP) నీటిని వినియోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు.

పెట్టుబడుల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని, ఆకర్షణీయమైన లోగో, వెబ్‌సైట్, కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక గ్రూప్-1 స్థాయి అధికారిని ‘ఎస్కార్ట్ ఆఫీసర్’గా నియమించే వ్యవస్థను తీసుకురానున్నారు. పారిశ్రామిక విధానాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.

ద్వితీయ శ్రేణి నగరాలపై ఫోకస్ & టీ-ఫైబర్

పరిశ్రమలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా కరీంనగర్, వరంగల్, విజయవాడ రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, అక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), డేటా సెంటర్లను తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక పాలసీని కూడా తేవాలన్నారు. అలాగే రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక చివరగా, రాబోయే మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ (T-Fiber) కనెక్టివిటీ పూర్తి కావాల్సిందేనని అధికారులకు డెడ్‌లైన్ విధించారు.

Also Read: ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×