BigTV English

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

Road Accident: అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు అక్కడికక్కడే మృతిచెందారు.


వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతిచెందారు. కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6) , కూతురు అత్త సునీత చనిపోగా.. అల్లుడు రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడుకి గాయలయ్యాయి. దీంతో షాద్ నగర్ నియోజకవర్గంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో కారును ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు.

కారు, ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్ దంపతులు 15 ఏళ్ల నుండి అమెరికాలో నివాసం ఉంటున్నారని బంధువులు పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలినికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


ఇదిలా ఉంటే.. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ జాతీయ రహదారిపై… ఆర్టీసీ బస్సును కారు డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు మహబూబ్ నగర్ పట్టణం ప్రేమ్ నగర్ కాలనీ వాసులుగా గుర్తించారు పోలీసులు.

Also Read: భర్తను వేధించిన భార్య, ఆపై సూసైడ్, ఏం జరిగింది?

మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా కోసిని గ్రామంలో రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ముగ్గురిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గ్రామ‌ సమీపంలోని కనకదుర్గ రైస్ మిల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది.

Related News

Keesara News: సినిమా స్టైల్‌లో ఇంట్లోకి వెళ్లి.. నవవధువును ఈడ్చుకుంటూ కారులోకి..? వీడియో వైరల్

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Big Stories

×