E-Paper
Advertisement

Telangana Govt Bumper Offer: మూసీ నిర్వాసితులకు బంపరాఫర్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు..

Telangana Govt Bumper Offer: మూసీ నిర్వాసితులకు బంపరాఫర్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు..
Advertisement

Telangana Govt Bumper Offer: కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. మూసీ కాలువ వెంబడి మరో రెండేళ్లలో మంచి నీరు ప్రవహించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. నీటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.

మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇప్పటికే చెప్పింది. అన్నట్లుగా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పిల్లలకు విద్యా సంవత్సం నష్టపోకుండా ఉండేందుకు సమీపంలోని పాఠశాలలో సీట్లు ఇవ్వనుంది. తాజాగా బాధిత కుటుంబాలకు రూ. 25000 వేల ప్రోత్సాహకం అందించనుంది. దీనివల్ల ఆయా ఫ్యామిలీలకు కొంత సమస్యలు తొలుగుతాయని భావిస్తోంది.

Advertisement

ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే రెవెన్యూ అధికారులు వారికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ కలెక్టర్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటి వరకు 40 శాతం మంది ఖాళీ చేశారు. మరో 40 శాతం మరో ప్రాంతానికి వెళ్లేందుకు ముందుకొచ్చారు. కేవలం 20 శాతం మాత్రమే ఇష్టపడటం లేదన్నది అంతర్గత సమాచారం.

ఇళ్లు ఖాళీ చేయనివారిలో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తొలగిస్తారన్నది అధికారుల మాట.

Advertisement

ALSO READ: సురేఖ Vs కేటీఆర్ కామెంట్స్.. అధిష్టానం నెక్ట్స్ ఏంటి?

ఇదిలావుండగా మూసీ నదికి త్వరలో మాస్టర్‌ప్లాన్‌ రాబోతుంది. అందుకు సర్వే చేపట్టేందుకు (మూసీ నది అభివృద్ధి సంస్థ) సింగపూర్‌ సంస్థను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే సర్వే ప్రారంభిస్తామన్నది అధికారులు చెబుతున్నారు. సంస్థ ప్రతినిధులు, నిపుణుల బృందాలు అనేక అంశాల్లో నదిని సర్వే చేస్తారని అంటున్నారు. రెండు రకాల (పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక)లను రూపొందించనున్నట్లు యంత్రాంగం చెబుతోంది.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×