Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో, హరీష్ రావు పాత్ర కూడా అంతే ఉందంటూ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. హరీష్ కసబ్లాంటోడని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. హరీష్ రావు నిత్యం అబద్ధపు మాటలు, బట్టేబాజ్, బగ్వాస్ మాటలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత హరీష్ కు లేదన్నారు. ఇప్పటికైనా హరీష్ రావు తన చిల్లర పలుకులు, బట్టేబాజ్ మాటలు బంద్ చేయాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతమైన ప్రజా పాలన సాగుతోందని సాయి కుమార్ కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి గత 30 నెలలుగా నిరంతరం రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ ప్రజల కోసం పనిచేస్తున్నారని గుర్తుచేశారు.
Also read: ముంబైలో పవన్ కళ్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
గత పాలకుల వల్లే కాకుండా, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సస్యశ్యామలంగా వర్ధిల్లుతోందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే హరీష్ రావు ప్రతిపక్షంలో కూర్చొని బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
Also read: Samantha:బేబీ బంప్ తో సమంత.. స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజ్!