E-Paper
Advertisement

Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..

Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..
Advertisement

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలోని రెసోనెన్స్ గురుకుల్ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య మత ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారి తల్లిదండ్రుల మధ్య దాడికి దారితీసింది. హాస్టల్ గదిలో గోడపై మతపరమైన రాతలు రాయడం, వాటిని చెరిపివేయడం కారణంగా డిసెంబర్ 2న రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ జరిగింది.

ఈ విషయం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, కొందరు తల్లిదండ్రులు క్యాంపస్‌కు వచ్చి ప్రిన్సిపాల్ గదిలో, కాలేజీ సిబ్బంది సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఒకరిని చెప్పుతో కొట్టగా, మరొకరిని గల్లా పట్టి కొట్టారు. లక్షల ఫీజులు చెల్లించి తమ పిల్లలను చేరిస్తే, ఇలాంటి అమానుష దాడులు జరగడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచిపెట్టడంపై మిగతా విద్యార్థుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల వసూలుపై ఉన్న శ్రద్ధ పిల్లల భద్రతపై లేదని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ గొడవ చివరకు బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్‌కు చేరింది.

Related News

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

Big Stories

Advertisement
×