E-Paper
Advertisement

Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..

Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..
Advertisement

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలోని రెసోనెన్స్ గురుకుల్ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య మత ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారి తల్లిదండ్రుల మధ్య దాడికి దారితీసింది. హాస్టల్ గదిలో గోడపై మతపరమైన రాతలు రాయడం, వాటిని చెరిపివేయడం కారణంగా డిసెంబర్ 2న రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ జరిగింది.

ఈ విషయం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, కొందరు తల్లిదండ్రులు క్యాంపస్‌కు వచ్చి ప్రిన్సిపాల్ గదిలో, కాలేజీ సిబ్బంది సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఒకరిని చెప్పుతో కొట్టగా, మరొకరిని గల్లా పట్టి కొట్టారు. లక్షల ఫీజులు చెల్లించి తమ పిల్లలను చేరిస్తే, ఇలాంటి అమానుష దాడులు జరగడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచిపెట్టడంపై మిగతా విద్యార్థుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల వసూలుపై ఉన్న శ్రద్ధ పిల్లల భద్రతపై లేదని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ గొడవ చివరకు బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్‌కు చేరింది.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×