E-Paper
Advertisement

Sankranti Gangiredlu : సంక్రాంతి ప్రత్యేకం.. డూడూ బసవన్నలు.. కనుమరుగవుతున్న సంప్రదాయాలు

Sankranti Gangiredlu : సంక్రాంతి ప్రత్యేకం.. డూడూ బసవన్నలు.. కనుమరుగవుతున్న సంప్రదాయాలు

Sankranti Gangiredlu : సంక్రాంతి అంటే పిండి వంటలు, రంగవల్లులు, హరిదాసులు, గొబ్బెమ్మలు, కోడిపందేలు, ఎడ్ల పోటీలే కాదు.. గంగిరెద్దుల సందడి కూడా. డూడూ బసవన్నల విన్యాసాలతో సందడిగా మారుతుంది. గంగిరెద్దుల ఆటలు లేనిదే సంక్రాంతి పరిపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. ఇంటింటికీ వచ్చి బసవన్నలు చేసే విన్యాసాలను పెద్దలు, పిల్లలను ఎంతగానో అలరిస్తాయి. అలాంటి గంగిరెద్దుల ఆడింటే వారి పరిస్థితి ఏంటి ?వాటిని ఎలా తయారు చేస్తారు ? తెలుసుకుందాం..

తెలుగురాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. పండుగలో కీలకంగా నిలిచే గంగిరెద్దుల ఆటంటే అందరికీ మక్కువే. గోదావరి జిల్లాల్లో జనవరి మాసంలో గంగిరెద్దులు కనిపిస్తాయి. పండుగ మూడ్రోజులు వాటి అలంకరణలు చూస్తే చూడ ముచ్చటగా ఉంటాయి. అసలు గంగిరెద్దులను ఎలా ముస్తాబు చేస్తారు. రంగురంగుల బట్టలు ధరించే వాటిని ఎలా పోషిస్తారన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఈ జనరేషన్ కు అయితే.. వాటి గురించే తెలియదు.

కాలానుగుణంగా వస్తున్న మార్పులతో సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. హరిదాసులు, గంగిరెద్దులు చాలా అరుదుగానే కనిపిస్తున్నాయి. గంగిరెద్దులను ఆడించే కుటుంబాలు ఇతర ఉపాధిని వెతుక్కోవడంతో క్రమంగా ఈ సాంప్రదాయం కనుమరుగవుతోంది.

గతంలో తమ పరిస్థితులు చాలా బాగా ఉండేవని.. క్రమంగా వస్తున్న మార్పులతో జీవనోపాధి కూడా కష్టంగా మారిందని వీరు చెబుతున్నారు. వంశ ఆచారం ప్రకారం.. వీటిని పోషించుకుంటూ వస్తున్నామని.. ఆశించినంత మాత్రం ఆదాయం రావటం లేదని చెబుతున్నారు. తమ పోషణతో పాటు వీటిని చూసుకోవటం కష్టంగా మారుతుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరాలుగా ఇదే వృత్తిలో ఉంటున్న వీరికి.. జనవరిలో వచ్చే సంక్రాంతి రోజు మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన సమయంలో వీరు.. ఇతర పనులకు వెళ్లటం ద్వారా జీవన ఉపాధి పొందుతారు. కానీ.. తమను నమ్ముకున్న జీవాలను మాత్రం చాలా ప్రాణంగా చూసుకుంటారు. ఏడాది కాలంలో ఆరుగాలంపాటు ఊరూర డూడూ బసవన్నలతో తిరుగుతూ.. దేశసంచారం చేస్తారు.

గంగిరెద్దులను తిప్పేవారిలోనూ 2 తెగలు ఉన్నాయి. ఒకరు పూర్తిగా గంగిరెద్దులపై జీవనం సాగిస్తే.. మరొక తెగ యక్షగాన కళాకారులు. తెలంగాణ ప్రాంతానికి వెళ్లి వీధి నాటకాలు ప్రదర్శించి వారిచ్చే సంభావనతో కుటుంబాలను పోషించుకుంటారు. మోటుపల్లి గ్రామంలో యక్షగాన కళాకారులున్నారు. వీరు ప్రదర్శించే కళలను చూసి.. యాదవులు మందకొక గొర్రె చొప్పున సంభావనగా ఇస్తారట. కానీ ఇప్పుడు.. టీవీలు, సినిమాలు రావడంతో.. ఇలాంటి కళారూపాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. తమ వృత్తిని పిల్లలకు నేర్పకపోవడంతో.. కళ అంతరించిపోతోంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×