E-Paper
Advertisement

Sharmila: కేసీఆర్ ఇంతకింత అనుభవిస్తారు.. బోనులో పెట్టినా పులి పులే.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే: షర్మిల

Sharmila: కేసీఆర్ ఇంతకింత అనుభవిస్తారు.. బోనులో పెట్టినా పులి పులే.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే: షర్మిల
SHARMILA

Sharmila Latest News(Political News Telangana): తాలిబన్ల రాజ్యంగా తెలంగాణ తయారైందని.. పోలీసులను కుక్కలుగా, తొత్తులుగా కేసీఆర్ వాడుకుంటున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి భార్యను, బిడ్డను అవమానించిన కేసీఆర్.. ఇంతకుఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. పోలీసులపై దాడి కేసులో బెయిల్ రావడంతో చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు వైఎస్ షర్మిల.

బోనులో పెట్టినా పులి పులేనని.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే అని షర్మిల సవాల్ చేశారు. గదిలో పెట్టి బంధిస్తే పిల్లి కూడా తిరగబడుతుందని.. పోలీసుల దాడితో సహనం నశించి, సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగానే తాను వారిపై దాడి చేశానని చెప్పుకొచ్చారు.

మగ పోలీసులు తన మీదమీదకు వచ్చి బెదిరించారని.. లేడీ కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వీడియో ఫూటేజ్ చూపించకుండా.. తాను కొట్టిన వీడియోలను మాత్రమే బయటకు వదిలారని విమర్శించారు. ఒక్కదానిపై అంతమంది దాడి చేస్తారా? మీకేమైనా సిగ్గు ఉందా? అంటూ ఖాకీలపై మండిపడ్డారు షర్మిల.

గతంలో హరీష్ రావు పోలీసులను కొట్టినా, కేటీఆర్ పోలీసులను తిట్టినా.. వారిపై కేసులు, అరెస్టులు ఉండవా? అని ప్రశ్నించారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×