E-Paper
Advertisement

Sudan: ఆపరేషన్ కావేరి.. సుడాన్‌ నుంచి భారతీయుల తరలింపు..

Sudan: ఆపరేషన్ కావేరి.. సుడాన్‌ నుంచి భారతీయుల తరలింపు..
Advertisement
operation kaveri

Sudan: సూడాన్‌లో సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును ప్రారంభించింది ఇండియా. ఆపరేషన్‌ కావేరి పేరుతో ఇప్పటికే ప్రత్యేక మిషన్ ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఇందులో మొదటి బ్యాచ్ గా 278 మంది భారతీయులను సూడాన్ నుంచి జెడ్డాకు తరలిస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో వారంతా ఢిల్లీకి చేరుకోనున్నారు.

సూడాన్ లో ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే సుమారు 500 మంది ప్రజలు చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ క్రమంలో సూడాన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది.

Advertisement

ఇందుకోసం ఆపరేషన్‌ కావేరి పేరిట భారత ప్రభుత్వం ప్రత్యేక మిషన్‌ ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే 500 మంది భారతీయులు సూడాన్‌ నౌకాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపారు. వారికి సంబంధించిన ఫొటోలు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మరికొందరు త్వరలోనే ఇక్కడికి చేరుకోనున్నట్లు చెప్పారు.

సూడాన్ నుంచి భారతీయుల తరలింపునకు జెడ్డాలో రెండు సి-130J సైనిక రవాణా విమానాలను భారత్ సిద్ధంగా ఉంచింది. సుడాన్‌లో యుద్ధ తీవ్రత, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. సుడాన్‌లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నట్లు అధికార గణాంకాల ద్వారా తెలుస్తున్నది.

Advertisement

విదేశీయుల తరలింపు కోసం సూడాన్ లో ఇరు వర్గాలు 72 గంటల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×