E-Paper
Advertisement

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
Advertisement

Raksha Bandhan tragedy: ఇది ఓ బాధతో నిండిన క్షణం. అక్క – తమ్ముడి అనుబంధానికి అక్షరాలా అర్ధం చెప్పిన సంఘటన. ఒక్కసారి ఆ దృశ్యం ఎవరైనా చూశారంటే గుండె వణికిపోకమానదు. రాఖీ పండుగ దగ్గరపడుతున్న వేళ.. ఒక అక్క తన తమ్ముడికి రాఖీ కట్టే అవకాశం కోసం ఎదురు చూస్తోంది. కానీ ఆ తమ్ముడు మాత్రం ఇక లేడు. ప్రాణాలు లేకుండా పడుకొని ఉన్న పాడెపైకి వెళ్లి, ఆ అక్క రాఖీ కట్టి తాను చూపిన ప్రేమతో అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి అనే వ్యక్తి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఊహించని విధంగా శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. కుటుంబంలో ఆనందాలు ఉండాల్సిన సమయంలో విషాదం అలుముకుంది. అంతే కాదు, రెండు రోజుల్లో రాఖీ పండుగ ఉండటంతో ఇంట్లో ఏర్పాట్లు కూడా మొదలయ్యే పరిస్థితి. కానీ ఆ ఇంట్లో మాత్రం కన్నీటి మౌనం అలముకుంది.

Advertisement

అప్పిరెడ్డికి అక్కగా ఉన్న జ్యోతి తమ్ముడి మరణవార్త విని విలపిస్తూ గ్రామానికి చేరుకున్నారు. పాడె దగ్గరకు వచ్చి, అతని ముఖాన్ని చూసి ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. మిగిలిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులంతా ఆమె బాధను చూస్తూ సంతాపంతో నిలిచిపోయారు. కానీ ఆమె మౌనంగా ఉండలేదు. రాఖీ పండుగకి తమ్ముడికి కట్టే రాఖీని వెంట తీసుకొచ్చిన జ్యోతి.. తమ్ముడి మృతదేహంపైనే రాఖీ కట్టి, తన ప్రేమను వ్యక్తపరిచారు.

అది చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర కన్నీటి పర్యంతం అయ్యారు. పాడెపైనే రాఖీ కట్టిన అక్కను చూసి, అక్కడున్న వారందరికి అక్కతమ్ముళ్ల బంధం అంటే ఏమిటో మరోసారి గుర్తుకు వచ్చింది. ‘ఇక నా చేతులెప్పుడూ ఖాళీగానే ఉంటాయి.. రాఖీ కట్టే గది ఇక మిగిలింది లేదు అంటూ జ్యోతి రోదించడంతో అక్కడి వాతావరణం మరింత భారంగా మారిపోయింది.

Advertisement

పక్కనున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా.. ఆమె మనస్సు మాత్రం ఆ తమ్ముడి జ్ఞాపకాల్లో చిక్కుకుని పోయింది. జీవితంలో ఎన్నో రాఖీలు కట్టాను కానీ, ఇదే చివరిది అని అనుకోలేదని చెప్పిన ఆమె మాటలు అందరినీ కదిలించాయి.

జీవితంలో చాలా సంబంధాలు ఉంటాయి.. కానీ అక్క – తమ్ముడి బంధం మాత్రం అత్యంత అనురాగభరితమైనది. తమ్ముడు బాల్యం నుంచే అక్క ముద్దుల్లో పెరుగుతాడు. అలాగే అక్క జీవితాంతం తమ్ముడిని చూసుకోవాలనుకుంటుంది. అలాంటి బంధం మధ్య ఓ పండుగ వస్తే.. అది వాళ్ల మధ్య ప్రేమకు గుర్తుగా ఉంటుంది. కానీ ఆ బంధాన్ని చీల్చిన మరణం ముందు ఎవరు ఏమీ చేయలేరు.

Also Read: Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

ఇటువంటి సంఘటనలు మనకు మన బంధాల విలువను గుర్తుచేస్తాయి. సాధారణంగా రాఖీ పండుగంటే ఆనందం, వేడుకలు, తమ్ముడికి బహుమతులు, అక్క చేతిలో తీపి తినిపించడం ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఈ కుటుంబానికి మాత్రం ఈసారి రాఖీ కన్నీటిలో తడిచిపోయింది. అక్క ప్రేమను తమ్ముడు చూడలేకపోయినా.. ఆమె చూపిన ఆఖరి గౌరవం మాత్రం ఆత్మకు శాంతిని ఇచ్చి ఉంటుందనిపిస్తోంది.

ఈ సంఘటనపై స్పందించిన గ్రామస్థులు.. ఇదొక ఉదాత్తమైన ప్రేమను ప్రతిబింబించే ఘట్టం. ఇది మన కళ్లతో చూసినా, నమ్మలేని దృశ్యం. ఎంత బాధలో ఉన్నా తన రాఖీ కట్టే హక్కును విడిచిపెట్టని ఆ అక్క మనందరికీ ఉదాహరణ అని చెప్పారు.

ఇలాంటి సంఘటనలు జీవితంలో బంధాలపై మనకెన్నో భావోద్వేగాలను కలిగిస్తాయి. కన్నీరు పెట్టిస్తాయి. తల్లడిల్లేలా చేస్తాయి. కానీ అదే సమయంలో బంధాలు ఎంత గొప్పవో చెప్పేలా చేస్తాయి. జ్యోతి అక్క చివరిసారిగా తన తమ్ముడికి రాఖీ కట్టిన తీరు మాత్రం కాలం ఎంత గడిచినా మరిచిపోలేరు. ఆమె కన్నీటి రాఖీ.. భారతీయ సోదరభావానికి నిదర్శనం.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×