Nalgonda Road accident(Telangana news today): ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన కారు విజయవాడ వైపు వెళ్తోంది. అందులో దాదాపు ఎనిమిది ఉన్నట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న కారు.. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీ కంటైనర్ కిందకు దూసుకుపోయింది. స్పాట్లో ఆరుగురు మృతి చెందారు.
అయితే సూర్యాపేటలోని కోదాడ మండలం ముకుందాపురం స్టేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో కృష్ణా జిల్లాకు చెందిన భార్యాభర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిలో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.
సూర్యాపేట జిల్లా
కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజి వద్ద జాతీయ రహదారిపై లారీని వెనక నుండి ఢీ కొట్టిన కారు
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి. కారులో నలుగురు పురుషులు,ఒక మహిళ, పాప వున్నారు
హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న కారు
లారీ బ్రేక్ డౌన్ కావడంతో హైవే పక్కన ఆపడంతో ఈ… pic.twitter.com/0undwM08G8— BIG TV Breaking News (@bigtvtelugu) April 25, 2024