E-Paper
Advertisement

Road Accident: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం

Road Accident: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం

Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్లుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు బ్రిడ్జీ పై నుంచి కిందపడిపోయి స్పాట్‌లోనే మరణించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా రాయదుర్గంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎర్రగడ్డ నుంచి మోయినాబాద్‌కు వెళ్లుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Also Read: అందరూ ఆల్ రౌండర్లే: భారత కోచ్ సాయిరాజ్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ పైనా ఇలాగే బైక్ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బైక్ పై వెళ్లుతుండగా ఆ బండి ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్ తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్, ఉద్యోగం వెతుకుతూ వచ్చిన బాల ప్రసన్నలుగా మృతులను గుర్తించారు. మసీద్ బండ నుంచి హఫీజ్ పేట్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×