E-Paper
Advertisement

Road Accident: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం

Road Accident: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం
Advertisement

Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్లుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు బ్రిడ్జీ పై నుంచి కిందపడిపోయి స్పాట్‌లోనే మరణించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా రాయదుర్గంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎర్రగడ్డ నుంచి మోయినాబాద్‌కు వెళ్లుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Advertisement

Also Read: అందరూ ఆల్ రౌండర్లే: భారత కోచ్ సాయిరాజ్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ పైనా ఇలాగే బైక్ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బైక్ పై వెళ్లుతుండగా ఆ బండి ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్ తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్, ఉద్యోగం వెతుకుతూ వచ్చిన బాల ప్రసన్నలుగా మృతులను గుర్తించారు. మసీద్ బండ నుంచి హఫీజ్ పేట్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×