BigTV English

Students : కలుషితాహారం ఎఫెక్ట్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత..

Students : కలుషితాహారం ఎఫెక్ట్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత..

Kasturba Gandhi students news telugu(Telangana news live) : వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి సాంబారు, వంకాయ కూరతో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. 70 మంది విద్యార్థులు అర్ధరాత్రి నుంచి కడుపులో మంటతో ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు.


రాత్రి సమయంలో కస్తూర్బా విద్యాలయంలో ఒక్కరే టీచర్‌ ఉన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో శుక్రవారం ఉదయానికి విద్యార్థుల పరిస్థితి మరింత విషమంగా మారింది.

అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా హాస్పటల్ కు తరలించాలని వైద్యులు స్పష్టం చేశారు. ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానిస్తున్నారు. తమ పిల్లలు పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

IPS Puran Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య దారుణం.. ఛండీగడ్‌లో డిప్యూటీ సీఎం భట్టి

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. భర్తను తలచుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన మాగంటి సునీత

Heavy Rains: తెలంగాణకు భారీ వర్షం సూచన.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో, దీపావళికి ముసురు?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. మొదలైన నామినేషన్ల ప్రక్రియ, గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Big Stories

×