E-Paper
Advertisement

Students : కలుషితాహారం ఎఫెక్ట్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత..

Students : కలుషితాహారం ఎఫెక్ట్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత..

Kasturba Gandhi students news telugu(Telangana news live) : వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి సాంబారు, వంకాయ కూరతో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. 70 మంది విద్యార్థులు అర్ధరాత్రి నుంచి కడుపులో మంటతో ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు.

రాత్రి సమయంలో కస్తూర్బా విద్యాలయంలో ఒక్కరే టీచర్‌ ఉన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో శుక్రవారం ఉదయానికి విద్యార్థుల పరిస్థితి మరింత విషమంగా మారింది.

అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా హాస్పటల్ కు తరలించాలని వైద్యులు స్పష్టం చేశారు. ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానిస్తున్నారు. తమ పిల్లలు పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×