E-Paper
Advertisement

Students : కలుషితాహారం ఎఫెక్ట్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత..

Students : కలుషితాహారం ఎఫెక్ట్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత..
Advertisement

Kasturba Gandhi students news telugu(Telangana news live) : వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి సాంబారు, వంకాయ కూరతో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. 70 మంది విద్యార్థులు అర్ధరాత్రి నుంచి కడుపులో మంటతో ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు.

రాత్రి సమయంలో కస్తూర్బా విద్యాలయంలో ఒక్కరే టీచర్‌ ఉన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో శుక్రవారం ఉదయానికి విద్యార్థుల పరిస్థితి మరింత విషమంగా మారింది.

Advertisement

అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా హాస్పటల్ కు తరలించాలని వైద్యులు స్పష్టం చేశారు. ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానిస్తున్నారు. తమ పిల్లలు పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×