BigTV English
Advertisement

Summer: ఈసారి ఎండలు మండుడే.. జర జాగ్రత్త..

Summer: ఈసారి ఎండలు మండుడే.. జర జాగ్రత్త..

Summer: శివరాత్రికి శివ శివా అంటూ చలిపోతుందని అంటారు. కానీ, ఈసారి శివరాత్రికంటే ముందే చలి పరారైనట్టు ఉంది. అయితే, కంప్లీట్ గా పోకుండా.. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ మండుతూ.. మిక్స్డ్ వెదర్ కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండ సుర్రున కాలుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు ఇంకెలా ఉంటుందోననే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. ఎండ దెబ్బ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.


రాత్రివేళలో చలి ఉంటోంది. తెల్లవారుజామున మరింత చలి పెరుగుతోంది. 11 తర్వాత బయటకు వచ్చే వాళ్లకు మాత్రం ఎండ ప్రతాపం తెలిసొస్తోంది. ఇలా డిఫరెంట్ కాక్ టైల్ వెదర్ తో తెలుగు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్ లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకు కారణం.. ‘ఎల్ నినో’. ఈ పేరు వింటేనే జనం హడలిపోతున్నారు గతంలో ఓ ఏడేళ్ల పాటు ‘ఎల్ నినో’ ఎఫెక్ట్ కు ఎండలు మండిపోయి.. వానలు కురవకుండా పోయి.. కరువు తాండవించి.. అబ్బో జనాలంతా ఆగమాగం అయ్యారు. ఆ ఎల్ నినో ఈసారి మళ్లీ వస్తోందనే మాటే కంగారు పెడుతోంది.


ఈ ఏడాది ఊహించిన ‘ఎల్ నినో’ కారణంగా వేసవి కాలం కఠినంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడనుందని చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ అంతటా ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తున్నారు.

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×