Digital Cabinet: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పేపర్ లెస్ గా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల సమావేశం జరిగింది. దీనిలో భాగంగా జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది.
Also Read: సీఎం విజయ్పై నటి సమంత ప్రశంసల.. బాబోయ్ మరీ ఇంతనా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులందరికి స్పెషల్ ట్యాబ్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అందరికి అందించారు. అనంతరం డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే మంత్రులకు క్యాబినెట్ సమావేశం కానుందని తెలిపారు. పేపర్ లెస్ గవర్నెన్స్లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ ఎర్పడింది.
Also read: హైవేలో ఏసీ సూపర్ కూలింగ్.. ట్రాఫిక్ లో ఎందుకు తగ్గిపోతుంది? అసలు మ్యాటర్ ఇదే!
తెలంగాణ ఎర్పరిచిన డిజిటల్ క్యాబినెట్ ద్వారా పత్రాల భద్రత, విలువైన అంశాలు, రాష్ట్ర అవసరాలకోసం తీసుకునే అత్యవసర విషయాలు, సమాచార గోప్యత మరింత పెరగనుంది. ఈ-క్యాబినెట్ విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక సాప్ట్వేర్ను ఉపయోగించనుంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా రూ.2కోట్ల రూపాయల వరకు ఖర్చు అవ్వనుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా ఎన్ఐసీకి అనే సంస్థకి మొదటి విడతగా రూ.20లక్షలు వరకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది.
Also Read: దేశ వ్యాప్తంగా మరో 7 కొత్త బుల్లెట్ రైల్ రూట్లు, కేంద్రం గ్రీన్ సిగ్నల్!