E-Paper
Advertisement

Telangana Assembly Sessions: ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలు మాత్రమే!

Telangana Assembly Sessions: ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలు మాత్రమే!
Advertisement

Telangana Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆరో రోజు సభ ప్రారంభమైంది. ప్రస్తుతం బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. కాగా, వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడా శాఖల పద్దులపై చర్చిస్తున్నారు.

అయితే సోమవారం చర్చించాల్సిన అంశాలు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు కీలక సూచనలు చేశారు. సోమవారం జరిగిన మాదిరిగా సుదీర్ఘ ప్రసంగాలు చేయకూడదని సభ్యులకు సూచించారు. ఈ మేరకు ఒక్కో సభ్యుడికి కేవలం 15 నిమిషాల సమయం కేటాయించారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని.. సబ్జెక్టుపైనే మాట్లాడాలని చెప్పారు. అయితే సోమవారం విద్యుత్ అంశంపై వాడీవేడిగా చర్చించిన సంగతి తెలిసిందే.

Advertisement

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. ఈ సమావేశంలో 19 అంశాలపై చర్చించనున్నారు. అయితే ప్రధానంగా ఇరిగేషన్, సివిల్ సప్లైపై వాడీవేడిగా చర్చస్తున్నారు. అలాగు 1.5లక్షల రుణాల వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. రెండో విడతలో 7 లక్షలమంది రైతులకు రూ.6,100కోట్లను జమ చేయనుంది. మధ్యాహ్నం 1వరకు అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×