BigTV English

Telangana Cabinet: త్వరలోనే కేబినెట్ విస్తరణ.. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ

Telangana Cabinet: త్వరలోనే కేబినెట్ విస్తరణ.. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ

హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. సోమవారం కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉండకూడదనే టార్గెట్‌గా కేంద్రం పని చేస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ పర్యటనలో సీఎంతో కలిసి పాల్గొననున్నారు.


Also Read: దసరా వేళ సంతోషంలో కాంగ్రెస్ కేడర్.. త్వరలోనే మరిన్ని..

మీటింగ్ ఎజెండా ఇదే..


దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రం, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ సమావేశంలో చర్చించనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు మరింత మెరుగైన రోడ్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రం చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, కావాల్సిన నిధులపై ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కేంద్రానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.

వరద సాయంపై వినతి..

ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణను ముంచెత్తిన వరదల తాలూకూ కేంద్రం అందించాల్సిన నష్టపరిహారం గురించి అమిత్ షాకు ప్రత్యేకంగా వినతి పత్రం ఇవ్వనున్నారని తెలుస్తోంది. గత వరదల మూలంగా తెలంగాణకు రూ. 10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లగా, కేంద్రం తెలంగాణకు ఎన్డీఆర్‌ఎఫ్ నిధుల కింద కేవలం రూ. 416.80 కోట్లు అందించింది. ఈ విషయాన్ని సమగ్ర నివేదిక రూపంలో మరోసారి గుర్తుచేసి, మరింత సాయం అందించాలని ముఖ్యమంత్రి.. అమిత్ షాను కోరనున్నారు.

Also Read: ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి

అధిష్ఠానంతో భేటీ

ఈ పర్యటనలో భాగంగా సీఎం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా కలిసి పలు కీలక అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై సీఎం పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారని, దసరా కంటే ముందే వీటిని క్లియర్ చేయాలని అటు పార్టీ పెద్దలూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉండగా, డజనుకు పైగా నేతలు పోటీపడుతున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. ఈసారి ఈ అంశంతో బాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల ఎంపిక జరగనుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.

Related News

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు.. ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు

CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. బీసీలకు 42% రిజర్వేషన్

Hyderabad News: బతుకమ్మకుంట ప్రారంభోత్సవం వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాలన్నీ జలమయం

Weather Alert: బలపడిన వాయుగుండం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. బయటకు రాకండి

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Big Stories

×