E-Paper
Advertisement

CM Revanth Reddy : రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష.. ఆరు గ్యారంటీల అమలుపై చర్చ..

CM Revanth Reddy : రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష.. ఆరు గ్యారంటీల అమలుపై చర్చ..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మరింత దృష్టిపెట్టారు. ఈ నెల 24 న అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. డా బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లాల కలెక్టర్లు, రెవెన్యు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం హజరుకానున్నారు.

ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి కాన్ఫరెన్స్‌ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కాన్ఫరెన్స్‌ లో ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుతోపాటు.. భూ రికార్డులతో ముడిపడిన అంశాలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ ప్రధాన ఎజెండాగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రతి గ్రామంలో వాడవాడలో 8 రోజులపాటు ప్రజావాణి నిర్వహించే కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, స్థానికంగా అందిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహణపై సీఎం అధికారులతో చర్చించనున్నారు.

Related News

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

Big Stories

Advertisement
×