CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. YIIRSలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు.
YIIRSల నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్యయమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని నిర్మలా సీతారామన్ను సీఎం కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం అందజేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు పెట్టే ఖర్చును ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా స్కూళ్ల ప్రాజెక్టు డీపీఆర్ను పంపాలని సీఎంకు కేంద్ర మంత్రి సూచించారు. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఐఐఎం కోసం 200 ఎకరాల భూమిని గుర్తించినట్లు సీఎం తెలిపారు. అదే విధంగా తెలంగాణకు 9 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరు చేయాలని సీఎం కోరారు.