BigTV English

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రవాసి ప్రజావాణికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ 7 తర్వాత మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఈ ఎక్స్ గ్రేషియా అందించనుంది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా.. గల్ఫ్‌ కార్మికుల వెల్ఫేర్‌ కోసం 2023 డిసెంబర్ 7 నుంచి కార్మికుల సమస్యలపై అడ్వైజరీ కమిటీని నియమించనుంది.


Also Read: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

ప్రవాస ప్రజావాణి పేరుతో నేటి నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది తెలంగాణ ప్రభుత్వం. బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలు అనేకం. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్య అవకాశాలను కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకటించారు.


 

Related News

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Big Stories

×