E-Paper
Advertisement

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం
Advertisement

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రవాసి ప్రజావాణికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ 7 తర్వాత మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఈ ఎక్స్ గ్రేషియా అందించనుంది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా.. గల్ఫ్‌ కార్మికుల వెల్ఫేర్‌ కోసం 2023 డిసెంబర్ 7 నుంచి కార్మికుల సమస్యలపై అడ్వైజరీ కమిటీని నియమించనుంది.

Also Read: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Advertisement

ప్రవాస ప్రజావాణి పేరుతో నేటి నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది తెలంగాణ ప్రభుత్వం. బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలు అనేకం. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్య అవకాశాలను కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకటించారు.

Advertisement

 

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×