BigTV English
Advertisement

Hyderabad News: పిల్లల భవిష్యత్‌తో ఆటలొద్దు.. గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆగ్రహం

Hyderabad News: పిల్లల భవిష్యత్‌తో ఆటలొద్దు.. గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆగ్రహం

Hyderabad News: స్వార్థ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్‌తో ఆటలు ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలోని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు. కసి, పట్టుదలతో తమ పిల్లలు ర్యాంకులు సాధించారని అన్నారు. ఇప్పుడు నోటికి వచ్చినట్టు నిందలు వేయడం సరికాదన్నారు. మాకు కచ్చితంగా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.


తెలంగాణలో జరిగిన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల మెరిట్ లిస్టుపై వారం కిందట హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పేపర్ల రీవాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. లేకుంటే మెయిన్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని తన తీర్పులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

దాదాపు 563 మంది ర్యాంకర్లు, మరో 100 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాంకర్లు పేరెంట్స్ మాట్లాడారు. మళ్లీ పరీక్షలు పెట్టాలని అంటున్నారని, ఫీజులు ఎవరు కడతారని ప్రశ్నించారు. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ పాసయ్యారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైతే ఆ తరహా ఆరోపణలు చేస్తున్నారో ఆధారాలను చూపాలని డిమాండ్ చేశారు.


ఇలాంటి ఆరోపణలతో మనోవేదనకు గురి చేస్తున్నారని పలువురు పేరెంట్స్ కంటతడి పెట్టారు. మీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని, ఈ విషయంలో అన్ని పార్టీల నేతలు సహకరించాలని కోరారు. పిల్లలు ఎంతో కష్టపడి గ్రూప్‌-1 పరీక్షలో పాస్ అయ్యారని, ఈ విషయంలో హైకోర్టు తమకు న్యాయం చేయాలని కోరారు.

ALSO READ: అక్టోబర్ రెండున ఏం జరగబోతోంది? ఆ రోజు లిక్కర్, మీట్ షాపులు తెరిచే ఉంటాయా?

పోస్టులు కొనుగోలు చేశామని చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని అన్నారు. ఈ విషయంలో దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా నిజాలు తెలియపరచాలని కోరారు. ఈ క్రమంలో పేరెంట్స్ వారి ఉద్యోగాలు, కష్టపడిన తీరును వివరించారు. ర్యాంకర్లతో అక్కడికి వచ్చినవారిలో కొందరికి తండ్రి లేనివారు ఉన్నారు. మరికొందరికి తల్లి లేనివారు ఉన్నారు.

ఈ క్రమంలో వారు కష్టపడి పిల్లలను చదివించిన తీరును వివరించారు. తాము అన్ని కష్టాలు పడి పిల్లలను చదివిస్తే.. లేనిపోని విధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అంటూ ఒకానొక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

ఈ వ్యవహారం జరుగుతుండగానే TGPSC కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. జాగృతి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు, నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

తెలంగాణలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ, వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టు తలుపు తట్టారు. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. క్వాలిఫై అయిన కొందరు అభ్యర్థులు పరీక్షను రద్దు చేయరాదంటూ మరికొన్ని పిటిషన్లను దాఖలు చేశారు. ఈ రెండింటిని కలిపి విచారించిన న్యాయస్థానం 222 పేజీలతో తీర్పు వెల్లడించింది.

 

Related News

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ రణరంగంలో గెలిచేది అతనే.. హీరో సుమన్ సంచలనం

kalvakuntla kavitha: కేటీఆర్, కేసీఆర్‌పై కుట్రలు.. బీఆర్ఎస్ నేత‌ల‌ గుట్టు విప్పుతున్న కవిత

CM Revanth: నవీన్‌ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే.. రూ.వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

Weather News: మళ్లీ రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు.. ఉరుములు, మెరుపులతో..!

Jubilee Hills Bipole: బస్తిమే సవాల్.. జూబ్లీ గడ్డ.. ఎవరి అడ్డా?

Yadadri Collector: ఇది కదా కలెక్టర్ అంటే.. ప్రజల సమస్య తెలిసిన వెంటనే పరిష్కారం.. జనాలు హర్షం వ్యక్తం

Kalvakuntla Kavitha: నేను ఎవరి బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. బీఆర్ఎస్ గుండెల్లో గుబులు..!

Big Stories

×