E-Paper
Advertisement

తెలంగాణలో నిప్పుల కుంపటిలా ఎండలు.. ఒక్క రోజులోనే 42 మంది మృతి..!

తెలంగాణలో నిప్పుల కుంపటిలా ఎండలు.. ఒక్క రోజులోనే 42 మంది మృతి..!

Telangana Heatwave: రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం కాగానే బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే తెలంగాణలో ఎండల దాడికి వడదెబ్బతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 42 మంది మృతి చెందినట్టు వార్తలోచ్చాయి. దీనిని బట్టి మనం ఎండ ఏ తీవ్రతలో కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వరంగల్‌లో నిన్న ఒక్కరోజు వడ దెబ్బకు 20 మంది మృతి చెందారు.

నేటి నుంచి రోహిణి కార్తి..

గత మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100 మందికి పైగా మృతి చెందారు. దీంతో వాతావరణ శాఖ తెలంగాణకు హై అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

Also read: హైదరాబాద్‌లో దారుణం.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య..!

రాబోయే రోజుల్లో..

రాష్ట్రంలో ఒక్కరోజే 42 మంది వడదెబ్బ కారణంగా మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 17 మంది మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది, కరీంనగర్ జిల్లాలో 8 మంది, నల్గొండ జిల్లాలో కూడా వడదెబ్బ ఘటనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.అగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొన్ని చోట్ల రాష్ట్రంలో నేల ఉపరితల ఉష్ణోగ్రతలు 100 డిగ్రీలకుపైగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా 43–46°C వరకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వడదెబ్బ నివారణ కోసం నీరు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బైటికి రావద్దని అధికారులు సూచించారు.

Also read: దారుణం.. కన్నతల్లి పై అఘాయిత్యానికి పాల్పడిన కొడుకు

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×