Bhadradri Incident: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మానవత్వం మంటగలిపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. సర్వసమాజం తల దించుకనే ఓ దారుణ సంఘటన అందరిని కలిచివేసింది. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిపైనే ఓ కన్న కొడుకు గంజాయి మత్తులో అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో ఆతల్లి అరుపులు కేకలు వేయగా చుట్టు పక్కల ఉన్న వారు వచ్చి కొడుకును చితక బాదారు.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురంలో కన్నతల్లిపై కొడుకు బానోత్ పవన్ లైంగిక దాడికి యత్నించిన ఘటన గత రాత్రి తెల్లవారుజామున చోటు చేసుకుంది. మద్యం, గంజాయి మత్తులో ఊగిపోతు సభ్య సమాజం తల దించుకొనేలా అమానుషానికి ఒడిగట్టాడు కన్న కొడుకే కన్న పేగు బందానికి తీరని మచ్చతెచ్చాడు. తల్లిని సహకరించాలని చిత్రవద చేసి చితకబాదాడా నరరూప రాక్షసుడు పవన్. తల్లి కొడుకు పవన్ చేస్తున్న అఘాత్యానికి తట్టుకోలేక కేకలు వేసింది. అరుపులు విని చుట్టుపక్కల వారు ఇంటిలోకి వచ్చారు. అనంతరం నిందితుడికి దేహశుద్ధి చేసి, కుటుంబ సభ్యులు పోలసులకు అప్పగించారు.
Also read: రైతు డిస్కం అంటే రైతుల పాలిట మరణశాసనమే: నిరంజన్ రెడ్డి ఫైర్!
నింధితుడు పవన్ను గ్రామస్థులు, బందువులు కలిసి ఆటోలో తాళ్లతో కట్టేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పాల్వంచ కిన్నెరసాని రూరల్ పోలీస్ స్టేషన్లో పవన్ ను బందువులు పోలీసులకు అప్పగించారు. గ్రామంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుందని గ్రామస్తులు ఆరోపణలు చేశారు. పవన్ ఫోన్ చెక్ చేస్తే గ్రామంలో ఎక్కడెక్కడ గంజాయి లభ్యమయేది, ఎవరెవరు గంజాయి సేవిస్తున్నారో తేలిపోతుందిని పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు ఇలాంటి దూరంఘతాలను కట్టడి చేయాలంటే గంజాయి అమ్మకం, కొనుగోలు దారులపై చర్యలు చేపట్టాలని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఈ అమానుష సంఘటనతో గ్రాంమంలో ఒక్కసారిగా అందరు షాక్కి గురయ్యారు.
Alslo Read: Fuel Prices: బిగ్ బ్రేకింగ్.. నాలుగోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు