Heatwave: స్వేచ్ఛ బ్యూరో: రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. ఉదయం 10 దాటకముందే కాలు కడప దాటనియ్యడం లేదు. అత్యవసర పనిమీద బయటకు రావాల్సి వస్తే ఎండ వేడిమి తాళలేక సతమతం కావాల్సి వస్తుంది. ఇలా సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన బిడ్డను ఎత్తుకొని వచ్చిన మహిళ ఎండ వేడిమికి అపసోపాలు పడుతూ భానుమూర్తి.. కరుణించవా అన్నట్టు తన చేతిలో ఉన్న బ్యాగుతో ఎండ నుంచి బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేసింది.
రాష్ట్రంలో పలు జిల్లాలో వివిధ రకాలుగా ఊష్ణోగ్రతలు నమోదైతున్నాయి. 42 డిగ్రీల నుడి దాదాపు 45 డిగ్రీల వరకు నమోదైతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్లోండ, నిజామాబాద్ మరియు అదిలాబాద్ ప్రాంత జిల్లా వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట జారీ చేసింది. అయితే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also read: నిజామాబాద్లో హనీ ట్రాప్ కలకలం
కొస్తాంద్ర ప్రాంతానికి సముద్ర గాలుల ప్రభావం ఉన్నప్పటికీ అక్కడి ప్రాంత మంతా ఉక్కపోత ఎక్కువగా ఉంది. రాయలసీమలోను ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరన శాఖ అధికారులు తెలిపారు. సాయం కాలం సమయానికి ఉత్తర కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.