India Pakistan Border: దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న తెలంగాణ వాసిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అక్కడికి వచ్చాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదానిపై విచారణ చేస్తున్నారు.
తెలంగాణకు చెందిన హుస్సేన్ రాజస్థాన్ లోని భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో అనుమానస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న జైసల్మేర్ ప్రాంతంలో తిరుగుతుండగా అతడ్ని చూసిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
Also Read: AC Buying Guide 2026: కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ అంశాలు తెలుసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడ్డట్లే!
అయితే జవాన్లు అడిగిన ప్రశ్నలకు హుస్సేన్ నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో ఉన్నతాధికారులకు వారు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో రంగంలోకి అధికారులు ప్రస్తుతం అతడ్ని విచారణ చేస్తున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు.. మరోసారి దాడులకు ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉదంతం కలకలం సృష్టించింది.