E-Paper
Advertisement

గిరిజన గురుకులాల్లో దారుణం.. 20 ఏళ్లు అయినా మినిమం పే స్కేల్ నో..?

గిరిజన గురుకులాల్లో దారుణం..  20 ఏళ్లు అయినా మినిమం పే స్కేల్ నో..?
Advertisement

Guest Lecturers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో దశాబ్దాల కాలంగా విద్యాబోధన చేస్తున్న పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ గెస్ట్ లెక్చరర్లు, టీచర్ల పరిస్థితి “దీపం ఉన్నా చీకటి”లా మారింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న తమ బతుకులకు మాత్రం భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
​తెలంగాణ గిరిజన గురుకుల ఫుల్ టైమ్ గెస్ట్, పార్ట్ టైమ్ లెక్చరర్స్ ,టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు.ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చారని, ఇప్పటికీ
నెరవేర్చక పోతే ఎట్లా? అంటూ యూనియన్ నేతలు ఫైర్ అవుతున్నారు.

​ప్రధాన సమస్యలు ఇవే..

​దాదాపు 20 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో, ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా వీరు పని చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం, గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న తమను మాత్రం విస్మరించడం పట్ల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఇప్పటికైనామినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ టీచర్లు, లెక్చరర్లకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలనీ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారు.దీనితో పాటు విధి నిర్వహణలో ఉంటూ మరణించిన పార్ట్ టైమ్, గెస్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని లెక్చరర్స్ కోరుతున్నారు.​”తాము గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాము. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి, మా కుటుంబాలను ఆదుకోవాలని సవినయంగా కోరుతున్నాము” అని గెస్ట్ లెక్చరర్స్ పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: Kerala Elections: కేరళ ఫలితాల్లో రేవంత్ మార్క్.. పనిచేసిన తెలంగాణ ఫార్ములా.. కాంగ్రెస్ ఖాతాలో మరో స్టేట్!

రెగ్యులరైజేషన్ కొరకు డిమాండ్..

​తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ గెస్ట్ లెక్చరర్ కి గత ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల సమయంలో గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ నేతలను రెగ్యులరైజేషన్ కొరకు డిమాండ్ చేశారు. పాజిటివ్ కోణంలో స్పందించినకాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదని సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలనీ, లేకపోతే సర్కార్ బై పోరాడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. తెలంగాణలోనూ ఎగిరేది కమలమే, రామచంద్రరావు ధీమా వ్యక్తం

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×