E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. భానుడి భగభగలకు బ్రేక్, మూడు రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. భానుడి భగభగలకు బ్రేక్, మూడు రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం ఉపశమనం పొందనున్నారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఏప్రిల్ 27 నుండి ఏప్రిల్ 30 వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. 

ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు.. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వాతావరణం ఒక్కసారి మారింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఎండ తీవ్రత వర్షాల కలయిక వల్ల ఉక్కపోత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అధికారులు కీలక సూచనలు.. 

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ఉరుములు, మెరుపులు మొదలైనప్పుడు బయటకు రాకపోవడమే మంచిది. వాహనదారులు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం పూర్తిగా తగ్గనందున డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగాలి. వడదెబ్బ తగలకుండా తలపాగా లేదా గొడుగు వంటివి ధరించడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.

రైతులు జాగ్రత్త..!

భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.. ‘కోతకు వచ్చిన పంటలు తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం సూచించిన హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి. విపత్తు నిర్వహణ కోసం 1070, పోలీస్ సేవలకు 100, వైద్య సహాయం కోసం 108 నంబర్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పులను గమనిస్తూ సురక్షితంగా ఉండాలి’ అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జర్మనీ అవకాశాలపై ఫోకస్.. విదేశాల్లో యువతకు శిక్షణ!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×