E-Paper
Advertisement

Fake Silver Coins: మున్సిపల్ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు పంచిన బీజేపి అభ్యర్ధి..?

Fake Silver Coins: మున్సిపల్ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు పంచిన బీజేపి అభ్యర్ధి..?

Fake Silver Coins: స్వేచ్ఛ బ్యూరో; అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ(BJP) పార్టీ 5 వ వార్డు అభ్యర్థి మాలతి మాధవరెడ్డి(Malathi Madhava Reddy) నకిలీ వెండి నాణేలను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ బిఆర్ఎస్(BRS) పార్టీ దశరథ్(Dasharatha) ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు దశరథ్ మాట్లాడుతూ.. ఓటర్లను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్..

మేడ్చల్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌కు ఓటర్లు క్రమంగా తరలి వస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది. ముడిచింతల్‌పల్లి మున్సిపాలిటీలో ఉదయం 9 గంటల వరకు 15.78 శాతం పోలింగ్ నమోదైంది. అలియాబాద్ మున్సిపాలిటీలో 17.69 శాతం ఓటింగ్ నమోదైంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో 12.99 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు కల్పించారు. అధికారులు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు.

Also Read: OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి హిట్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..?

అలియాబాద్ మున్సిపల్‌లో..

మేడ్చల్ స్వేచ్ఛ :అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాలగడి మలక్‌పేట్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ సందర్శించారు. సునీతమైన ప్రాంతం కావడంతో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఒక పోలింగ్ స్టేషన్ లో 1900 ఓట్లు ఉన్నాయి.2 వార్డులకు సంబంధించి 4 పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.ఉదయం 10.30 గంటల వరకు సుమారు 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ రమేష్ పేర్కొన్నారు.ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రమేష్ కోరారు.ఆయనతో పాటు అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఎసిపి శ్రీనివాస్ రెడ్డి , బాల గంగిరెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు

Also Read: Ananthagiri Eco Tourism: పర్యాటకులకు ఇక పండగే.. అనంతగిరిలో ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించిన సర్కార్..!

Related News

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

Big Stories

×