E-Paper
Advertisement

Jagtial : చెరువుల్లో నాసిరకం చేప సీడ్.. గత ప్రభుత్వం మోసం చేసిందని గంగపుత్రుల ఆరోపణ..

Jagtial : చెరువుల్లో నాసిరకం చేప సీడ్.. గత ప్రభుత్వం మోసం చేసిందని గంగపుత్రుల ఆరోపణ..
Advertisement
Jagtial latest news

Jagtial latest news(Local news telangana):

నాసిరకం చేపలు వేసి రైతులను మోసం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద గంగపుత్రులకు జీవనదారం అయిన చేప పిల్లల పంపిణి లో గత ప్రభుత్వం నాసిరకం చేపలు పంపిణి చేసింది.

గంగపుత్రుల నోట్లో మట్టి కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం జగిత్యాల సమీపంలో గల ముప్పాలా చెరువు, తిమ్మాపూర్ చెరువు, రాజుల చెరువు లో రవ్వులు అనే ఫిష్ సీడ్ గత ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. సిల్వర్ ఫిష్ అని ఎదో కొత్త రకం చేప సీడ్ ఇచ్చారని ఏడాది కాలంగా పెరగడం లేదని మత్స్యకారులు తెలిపారు.

Advertisement

రవ్వులు, బొచ్చేలు, బంగారు తీగ సీడ్ ఇస్తామని చెప్పి చివరికి సిల్వర్ ఫిష్ సీడ్ ఇచ్చారని గంగపుత్రులు అన్నారు. వీటిని వ్యాపారులు గాని, ప్రజలు గాని కొనడం లేదని తాము నష్టపోతున్నామని వాపోయారు. గతంలో సకాలంలో చేప పిల్లలు పోయాక తాము ఇబ్బదులు ఎదురుకుంటున్నామని అన్నారు.

కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణితో తమ జీవితాలని మారుస్తామన్నా కేసీఆర్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మత్స్యకారలు అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్ని గంగపుత్రులు వెల్లడించారు.

Advertisement

కొత్త ప్రభుత్వం గంగపుత్రుల పరిస్థితిని అర్థం చేసుకొని బాధ్యుడైనా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కొరారు. తమకు నాణ్యమైన చేపలు పంపిణి జరిగేలా చూడాలని గంగపుత్రులు అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×