E-Paper
Advertisement

Actor Suman: అసలైన రియల్ హీరో సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ ధర్నాలో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Actor Suman: అసలైన రియల్ హీరో సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ ధర్నాలో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Actor Suman: బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్‌ వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సభలో సినీ నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు ఎక్కడ వస్తాయని అందరూ అనుమానాలు వ్యక్తం చేసిన  సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకువచ్చి చూపించారని.. ఆయన రియల్ హీరో అని సుమన్ ప్రశంసించారు.

వారికి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి: సుమన్

Advertisement

ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధర్వంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ మహాధర్నాకు సుమన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా బీసీలమంతా  సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బీసీలు ఉన్నారని.. సీఎం పెద్దమనసు చేసుకుని వారికి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ చాలా ఏళ్ల నుంచి ఉందని.. ఇది నెరవేరిస్తే సీఎం రేవంత్ వారికి దేవుడు అవుతారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు.

ALSO READ: CISF Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు..

Advertisement

పార్లమెంట్ లో ఆమోదించి అమలు చేయాలి..

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. తెలంగాణ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌ లోనూ ఆమోదించి అమలు చేయాలని ఢిల్లీలో బీసీ సంఘాలు నిర్వహిస్తున్న మహాధర్నా కొనసాగుతోంది. అలాగే దేశవ్యాప్తంగా కులగణన, 33 శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడిన విషయం తెలిసిందే.

మహాధర్నాకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మద్ధతు

బీసీ సంఘాలు నిర్వహిస్తున్న మహాధర్నాకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు సైతం మద్దతు తెలిపారు. మహా ధర్నాలో తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ కోదండరామ్, కాంగ్రెస్ నేత వీహెచ్, సినీ నటుడు సుమన్, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితర కీలక వ్యక్తులు ఉన్నారు. బీసీ పోరు గర్జన సభకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బీసీ సంఘాలు ఆహ్వానించినా రెండు పార్టీలు ధర్నాకు దూరంగా ఉన్నాయి.

ALSO READ: CM Revanth Reddy: అసలు మేం 42% రిజర్వేషన్లు ఇస్తే మోదీకి ఏం ప్రాబ్లమ్: సీఎం రేవంత్ రెడ్డి

ALSO READ: RCF Ltd Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం అక్షరాల రూ.46,300

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×