E-Paper
Advertisement

Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్.. మహారాష్ట్రలో ఆచూకీ లభ్యం

Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్.. మహారాష్ట్రలో ఆచూకీ లభ్యం

 Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాపైన బాలుడు క్షేమంగా దొరికాడు. ఎట్టకేలకు జీజీహెచ్‌లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు బాలుడు మణికంఠను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ఏడాది బాలుడు మణికంఠను కిడ్నాప్ చేశారు. కొంతమంది మహిళలు కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీలో కనిపించారు. అయితే కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రాంతానికి చెందిన పిల్ల రాజు, లక్షిలు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. అయితే వీరిద్దరూ ఆస్పత్రిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ముగ్గురు మహిళలు వాళ్లమధ్యన నిద్రిస్తున్న బాలుడు మణికంఠను ఎత్తుకెళ్లారు.

తర్వాత లేచి చూడగా.. బాలుడు కనిపించకపోవడంతో ఆస్పతిలో వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో బాలుడు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీలో ఫుటేజీలను తనిఖీలు చేయగా.. ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం

సీసీ కెమెరాల ఆధారంగా ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన బాలుడు మణికంఠను ఆ మహిళలు మహారాష్ట్ర తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే ప్రత్యేక బృందంతో మహారాష్ట్రకు వెళ్లి నిందితులను, బాలుడిని పట్టుకున్నారు.

Related News

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

Big Stories

×