E-Paper
Advertisement

Temperatures in Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు!

Temperatures in Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు!
Advertisement

Temperatures in Telangana: తెలంగాణలో సూరీడు సుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే చాలు వేడి గాలులతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా గరిష్ట ఉష్ణోగ్రతల రికార్డులను బద్దలుకొడుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తరుణంలో ప్రజలకు వాతావరణ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. అవసరం ఉంటే తప్ప బయటకు అస్సలు రాకూడదని సూచించింది.

Advertisement

Also Read: TSRTC Good News : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై ఛార్జీలుండవ్..

సూర్యపేట జిల్లాలోని మునగాలలో 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్ భూపాలపల్లిలోను ఎండలు మండిపోతున్నాయి. సింగరేణి ఏరియా అయినందున బొగ్గుగనులు, థర్మల్ కేంద్రాల కారణంగా వడగాలులు, వేడి తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×