E-Paper
Advertisement

Temperatures in Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు!

Temperatures in Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు!

Temperatures in Telangana: తెలంగాణలో సూరీడు సుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే చాలు వేడి గాలులతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా గరిష్ట ఉష్ణోగ్రతల రికార్డులను బద్దలుకొడుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తరుణంలో ప్రజలకు వాతావరణ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. అవసరం ఉంటే తప్ప బయటకు అస్సలు రాకూడదని సూచించింది.

Also Read: TSRTC Good News : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై ఛార్జీలుండవ్..

సూర్యపేట జిల్లాలోని మునగాలలో 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్ భూపాలపల్లిలోను ఎండలు మండిపోతున్నాయి. సింగరేణి ఏరియా అయినందున బొగ్గుగనులు, థర్మల్ కేంద్రాల కారణంగా వడగాలులు, వేడి తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×