E-Paper
Advertisement

Mahesh Kumar Goud: కష్టపడి పనిచేసే మహిళా నేతలకే పదవులు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: కష్టపడి పనిచేసే మహిళా నేతలకే పదవులు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కోసం క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. పదవుల కోసం పాకులాడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహిళా నేతలకు దిశానిర్దేశం చేశారు.

పదవులు పొందడం ముఖ్యం కాదని.. వాటిని అలంకారప్రాయంగా చూడకుండా బాధ్యతగా స్వీకరించాలని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కేవలం హోదాలకే పరిమితం కాకుండా పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని కోరారు. రాబోయే రోజుల్లో మహిళలకు చట్టసభలలో అధిక సీట్లు రానున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం రిజర్వేషన్ల కోటా ప్రకారమే కాకుండా.. బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలకు అంతకంటే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఈ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి మహిళకు అందేలా చూడాల్సిన బాధ్యత మహిళా కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని.. మహిళా నాయకురాళ్లను ప్రోత్సహించడంలో పార్టీ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సహా పలువురు ముఖ్య నాయకురాళ్లు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

Advertisement

Read Also: Akhil Mahajan: విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. వారికి జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×