Akhil Mahajan: విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడడం, విధులను అడ్డుకోవడం వంటి చర్యలు అసలు సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధుల్లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు ఘటనల్లో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసిజిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో భాగంగా 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై కఠిన మైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (Akhil Mahajan) ఐపీఎస్ హెచ్చరించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉంటూ, నట్లు తెలిపారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణలో ఉద్యోగులకు రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా.. దేశంలోనే మొట్టమొదటిసారి..
ఈ ఘటనలకు సంబంధించి మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, పోలీసు సిబ్బందికి సహకరించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తినప్పుడు చట్టబద్ధ మార్గాలను ఆశ్రయించాలని సూచించారు. పోలీసులపై దాడులు, విధులకు అడ్డంకులు కలిగించడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటానికి, నేరాలను అరికట్టడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల సహకారం పోలీసులకు అత్యంత అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.
Also Read: Induction Stove Tips: వంట అవ్వగానే.. ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేస్తున్నారా? అయితే చిక్కుల్లో పడ్డట్లే!