E-Paper
Advertisement

MP Aravind : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..

MP Aravind : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..
Advertisement

MP Aravind : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంట్లోకి చొరబడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు.

ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై విమర్శలు గుప్పించారు. ఆమె పార్టీ మారతారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. అందుకే దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తన నివాసంపై దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×