E-Paper
Advertisement

Congress: కాంగ్రెస్ ప్రజా పోరుబాట.. జూమ్ మీటింగ్ డిసిషన్..

Congress: కాంగ్రెస్ ప్రజా పోరుబాట.. జూమ్ మీటింగ్ డిసిషన్..
Advertisement

Congress: తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ ప్రజల తరఫున పోరుబాట పట్టనుంది. రైతు కేంద్రంగా ప్రభుత్వంపై పోరు సలపాలని నిర్ణయించింది. పోడు భూములు, ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోరాడేలా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కార్యచరణ సిద్ధం చేశారు.

ఈనెల 21న టీపీసీసీ ఆధ్వర్యంలో సీఎస్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. 24న అన్ని మండలాల్లో నిరసనలు, 30న నియోజకవర్గ కేంద్రాల్లో, డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆ తర్వాత గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తారు. ఇందిరాపార్క్‌ దగ్గర రెండ్రోజులు దీక్ష చేయనున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ కింద 47లక్షల మందికి రూ.25వేల కోట్లు చెల్లించేలా ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ నిర్ణయించింది. ప్రకృతి విపత్తుల కారణంగా 15లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ భూములను సీలింగ్‌ ల్యాండ్ పేరిట ప్రభుత్వం పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని తప్పుబట్టారు.

ప్రజా సమస్యలు చర్చకు రాకుండా టీఆర్ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. గతంలోనూ నయీం కేసు, డ్రగ్స్ కేసు, ఆర్టీసీ కార్మికుల ధర్నా.. తదితర అంశాలను వివాదాస్పదం చేసి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించారని గుర్తు చేశారు. ఈ సారి అలాకాకుండా.. పోడు భూములు, ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

Advertisement

ఈ జూమ్ మీటింగ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గైర్హాజరు అయ్యారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్‌ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీ తదితరులతో హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జూమ్‌ మీటింగ్‌ జరిగింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×