E-Paper
Advertisement

TSPSC : సరికొత్త విధానంలో TSPSC బోర్డు సభ్యుల నియామకం.. ఆ విధానానికి స్వస్తి..

TSPSC : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) ఛైర్మన్, సభ్యుల భర్తీకి సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ పోస్టులను ఇప్పటివరకు నామినేటెడ్ విధానంలో సభ్యులను నియమిస్తున్నారు. అయితే తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తును నింపి సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు.

TSPSC : సరికొత్త విధానంలో TSPSC బోర్డు సభ్యుల నియామకం.. ఆ విధానానికి  స్వస్తి..

TSPSC : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) ఛైర్మన్, సభ్యుల భర్తీకి సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇప్పటి వరకు నామినేటెడ్ విధానంలో సభ్యులను నియమిస్తున్నారు. అయితే తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తును నింపి సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మూడు పేజీల అప్లికేషన్ ఫారంని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీ కోసం రూపొందించింది. ఇందులో విద్యార్హతలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో పనిచేసిన వివరాలు, విధులు, ఉద్యోగంలో సాధించిన విజయాలు మొదలైన పూర్తి సమాచారం నింపాలి. న్యాయశాస్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, హ్యుమానిటీస్ లేదా పనిని గుర్తించే రంగానికి సంబంధించిన వివరాలు, నిర్వహించిన బాధ్యతలు మొదలైన పూర్తి సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. తమ ప్రత్యేకతలు విజయాలను 200 పదాల్లో వివరించాలి.

పరిశీలనకు వచ్చిన దరఖాస్తులను సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేయనుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, ఇతర సభ్యులను గవర్నర్ నియమిస్తారు.

మరోవైపు టీఎస్‌పీ‌ఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళసైకు పంపించారు. టీఎస్‌పీఎస్సీ లో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం మారడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు.

.

.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×