TSRTC Decision: డిజిటల్ సేవలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. తాజాగా మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు బస్సు ఎక్కే ముందు టికెట్ కోసం కండక్టర్ గురించి చూడాల్సిన పని లేదు. ప్రయాణికులు స్వయంగా టికెట్ తీసుకునే వ్యవస్థను తీసుకురానుంది. అందుకోసం బస్సులో QR కోడ్ ఆధారిత సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ సేవలను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ స్టాప్ బస్సు సర్వీసుల్లో సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సు ఎక్కే ముందు కండక్టర్ కోసం చూడకుండా ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. నాన్స్టాప్ బస్సుల్లో ప్రయాణం చేసేవారికి ఈ విధానం ఉపయోగపడనుంది. ప్రస్తుతం డ్రైవర్ వచ్చి ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే పద్దతి ఉంది. అలాకాకుండా బస్సు ప్రవేశ ద్వారం వద్ద QR కోడ్ను ఆర్టీసీ ఏర్పాటు చేస్తే ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్తో స్కాన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రయాణికుడు ఎక్కడ బస్సు ఎక్కాలి? ఎక్కడ దిగాలి? అనే వివరాలను నమోదు చేసి ఆన్లైన్ చెల్లింపు పూర్తి చేస్తే వెంటనే మొబైల్లో డిజిటల్ టికెట్ వస్తుంది. ఆ టికెట్ డ్రైవర్కు చూపించి బస్సు ఎక్కవచ్చు. ప్రయోగాత్మకంగా స్మార్ట్ టికెట్ విధానాన్ని తొలుత నల్గొండ-హైదరాబాద్ మార్గంలో అమలు చేయాలని డిసైడ్ అయ్యింది ఆర్టీసీ. ప్రస్తుతం ఈ రూట్లో 45 వరకు డీలక్స్, నాన్స్టాప్ బస్సులు తిరుగుతున్నాయి. ఆ రూట్లో కొత్త పద్దతి సక్సెస్ అయితే సెప్టెంబర్ నుంచి అన్ని నాన్స్టాప్ రూట్లలో విస్తరించాలని భావిస్తున్నారు అధికారులు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు చిల్లర సమస్య తీరుతుంది. ట్రావెల్ సమయం ఆదా అవుతుంది. అదే సమయంలో టికెట్లు జారీ చేసే పని భారం డ్రైవర్లకు తగ్గుతుంది.
స్మార్ట్ఫోన్లు లేనివారు పరిస్థితి ఏంటి? అన్నది పెద్ద ప్రశ్న. డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేని ప్రయాణికులు డ్రైవర్ వద్ద టికెట్ కొనుగోలు చేయవచ్చు. సెల్ఫ్ టికెటింగ్ విధానం కోసం మీ సేవకు చెందిన మీ టికెట్తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. మీ టికెట్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లకు పరిమితం కాలేదు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించాలన్నా, ఆలయాలు, పార్కులు, మ్యూజియంలు, గోల్కొండ ఫోర్ట్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలన్నా ముందుగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లిన తర్వాత టికెట్ కౌంటర్ల వద్ద నిలబడాల్సిన అవసరం లేదు.
ALSO READ: నేపాల్లో హైదరాబాద్ యువతి మిస్సింగ్.. డీఆర్డీవో మాజీ డైరెక్టర్ సహా.. మరో 30 మంది సేఫ్!