E-Paper
Advertisement

Turmeric Record Price in Nizamabad : 13 ఏళ్ల తర్వాత రికార్డు ధర పలికిన పసుపు ధర.. క్వింటా రూ.17 వేలకు పైనే..

Turmeric Record Price in Nizamabad : 13 ఏళ్ల తర్వాత రికార్డు ధర పలికిన పసుపు ధర.. క్వింటా రూ.17 వేలకు పైనే..
Advertisement

Turmeric Record Price in Nizamabad

Turmeric Record Price in Nizamabad(Telangana news today): పసుపు రైతులకు మంచిరోజులొచ్చాయి. కొద్దిరోజులుగా పసుపు పంటకు గిట్టుబాటు ధర పెరుగుతుంది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో గరిష్ఠంగా.. క్వింటా పసుపు ధర రూ.17,011 పలికింది. ఇప్పటి వరకూ ఉన్న ధరల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు అంటున్నారు. 2011లో క్వింటా పసుపు ధర రూ.16,166 పలుకగా.. ఇప్పటి వరకూ అదే రికార్డు ధరగా ఉంది. తాజాగా 17 వేలకు చేరడంతో ఆ రికార్డు బ్రేక్ అయింది.

Advertisement

నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డుకు.. నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ప్రాంతాల నుంచి పసుపు రైతులు నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే పసుపు అమ్మకాలు జరుపుతుంటారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో ధర పలుకుతుండటంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత పసుపుకు రికార్డు ధర వచ్చిందంటున్నారు. ఇన్నాళ్లు పసుపు పండించి నష్టపోయిన వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

Read More : TSERCలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల

Advertisement

పసుపుకు ఈ స్థాయిలో ధర రావడంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. నిజామాబాద్ కు కేంద్రం పసుపుబోర్డు ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. పూర్తిస్థాయిలో బోర్డును ఏర్పాటు చేశాక.. మరింత రికార్డు ధర వస్తుందని, ఈ రికార్డును తామే తిరగరాస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018-19లో పసుపు ఎగుమతులు లక్ష 33 వేల 600 టన్నులు ఉంటే.. ఇప్పుడు అది లక్ష 70 వేల 25 టన్నులకు పెరిగిందన్నారు. ఐదేళ్లలో పసుపు ఎగుమతులు 35 వేల టన్నుల మేర పెరిగిందని వివరించారు. పసుపు ఎగుమతి పెరిగి.. దిగుమతి తగ్గడం శుభపరిణామని తెలిపారు. ఆసియాలోనే నిజామాబాద్ పసుపుకు డిమాండ్ ఉందన్నారు.

Tags

Related News

ఆగా ఖాన్ ఫౌండేషన్‌కి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. సీఎం వ్యూహం అదేనా..?

అసెంబ్లీని చెడగొట్టడమే వారి కుట్ర.. బీఆర్‌ఎస్‌ తీరుపై బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

22A భూముల వెనుక పెద్దల హస్తం..? సంచలన నిజాలు బయటపెట్టిన రఘునందన్ రావు!

సుప్రీం కోర్టులో హైడ్రాకు చుక్కెదురు.. 40 ఎకరాల భూమి కేసు డిస్మిస్!

సీఎం రేవంత్‌తో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది.. ! బీసీ మంత్రి భర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ!

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌.. ప్రిన్స్ రహీమ్ అగాఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ, గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

రౌడీషీటర్ నయీమ్‌ దారుణ హత్య.. హైదరాబాద్‌లో ఓ వైన్ షాపు ముందు ఘటన, సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా

Big Stories

Advertisement
×