E-Paper
Advertisement

Mastan sai Arrested: డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. స్పందించిన లావణ్య

Mastan sai Arrested: డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. స్పందించిన లావణ్య
Advertisement

Mastan sai arrested in Drugs Case(TS news updates): రాజ్ తరుణ్, లావణ్య కేసులో… తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్లల్లో నానుతున్న మస్తాన్ సాయి అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో తెలిపింది. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ తరలిస్తుండగా దాడులు చేశారు పోలీసులు. ఐతే అప్పట్లో పోలీసుల కళ్లుగప్పి మస్తాన్సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ఓ దర్గాలో తల దాచుకోగా అరెస్ట్ చేశారు.

మస్తాన్ సాయి ఫోన్‌లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రయివేటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి మొబైల్‌‌లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకుని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Also Read: ప్రాణం తీసిన ఫోన్, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే…

ఇదిలా ఉంటే మస్తాన్ సాయి కేసుపై లావణ్య స్పందించింది. మస్తాన్ సాయి అరెస్ట్ గురించి తనకు ఇప్పుడే తెలిసిందని, వరలక్ష్మి టిఫెన్ సెంటర్ కేసులో తమ పేర్లు కావాలనే ఇరికించారని ఆరోపించింది. రాజ్ తరుణ్ కేసులో సెటిల్మెంట్ కోసం రూ. కోటి డిమాండ్ చేశారని పేర్కొంది. తాను కూడా మస్తాన్ సాయి బాధితురాలినేని వెల్లడించింది. తాను డ్రెస్ చేంజ్ చేసుకునే వీడియో మస్తాన్ సాయి ఫోన్‌లో ఉందని.. ఆ ఫోటోలతో తనను వారం రోజుల నుంచి మస్తాన్ బెదిరిస్తున్నాడని ఆరోపించింది.

Related News

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Big Stories

Advertisement
×